ఆ ముగ్గురూ ‘వెంకీ మామ’ కు భారీ దెబ్బేసేలా ఉన్నారే…..!!

-

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య హీరోలుగా యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వెంకీ మామ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. మంచి ఎమోషన్ తో పాటు ఎంటర్టైన్మెంట్, యాక్షన్ వంటి అంశాలు సమపాళ్లలో కలిపి దర్శకుడు బాబీ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక ఇప్పటివరకు దాదాపుగా అన్ని ప్రాంతాల్లో బాగానే కలెక్షన్ రాబట్టిన ఈ సినిమాకు రేపటి నుండి భారీ దెబ్బే పడేలా ఉంది. దానికి కారణం రేపు బాలకృష్ణ రూలర్, సాయి ధరమ్ తేజ్ ప్రతిరోజు పండగే, కార్తీ దొంగ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

 

గతంలో ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలతో పరాజయాలు అందుకున్న బాలయ్య, ఎలాగైనా రూలర్ తో హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని చూస్తున్నారు. నందమూరి ఫ్యాన్స్ కూడా తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల వరుసగా ఆరు పరాజయాలు చవి చూసిన సాయి ధరమ్ తేజ్, కొద్దిరోజుల క్రితం చిత్రలహరి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ప్రస్తుతం యువ దర్శకుడు మారుతీ దర్శకత్వంలో నటిస్తున్న ప్రతిరొజూపండగే సినిమాపై కూడా మెగా ఫ్యాన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి.

అలానే ఇటీవల ఖైదీ వంటి సూపర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తీ, రేపు మంచి అంచనాలతో రాబోతున్న దొంగ తో మరొక హిట్ కొట్టి, తన విజయాల పరంపరను కొనసాగించాలని చూస్తున్నాడు. ఇక ఈ మూడు సినిమాలు కూడా రేపు రిలీజ్ అవుతుండడంతో, వెంకీ మామను కొన్ని థియేటర్స్ నుండి తీసేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇక ఈ మూడిట్లో ఏదైనా మంచి హిట్ కొట్టినా, లేదా అన్ని కూడా మంచి సక్సెస్ అందుకున్నా, ఆ దెబ్బ వెంకీ మామ పై భారీగానే పడడం ఖాయం అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరి రేపు రిలీజ్ కాబోతున్న ఈ మూడు సినిమాలు ఎంత మేర సక్సెస్ ని అందుకుంటాయో చూడాలి……!!

Read more RELATED
Recommended to you

Latest news