Chiranjeevi : ‘మెగా’ మూవీలో ముగ్గురు స్టార్ హీరోయిన్లు?

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసారా దర్శకుడు వశిష్ఠతో తన 156 సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి ‘విశ్వంభర’ అనే టైటిల్ ని అనౌన్స్ చేస్తూ.. సినిమా కాన్సెప్ట్ టీజర్ ని చిత్ర బృందం రిలీజ్ చేశారు. ఆల్రెడీ ఈ చిత్రం మారేడుమిల్లి అడవుల్లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ సినిమాని దాదాపు 75 శాతం VFX పైనే తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.

Three star heroines in Mega star Chiranjeevi movie

2025 సంక్రాంతికి ఈ సినిమాని తీసుకు వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని చిరంజీవి కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. అయితే, మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు వశిష్ట కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘విశ్వంభర’ మూవీలో ముగ్గురు స్టార్ హీరోయిన్లు నటించనున్నట్లు తెలుస్తోంది. త్రిష, నయనతార, దీపిక ఈ సినిమాలో నటిస్తారని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవల విడుదలైన చిత్ర టైటిల్ రివీల్ వీడియోకు మంచి స్పందన వస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news