మేజర్ కోసం ఆ ముగ్గురు..!

-

26/11 టెర్రరిస్ట్ దాడిలో తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండాపోరాడిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా 26/11 బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా మేజర్. శశి కిరణ్ తిక్కా డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లీడ్ రోల్ లో నటిస్తున్నారు అడివి శేష్. యువ హీరోల్లో డిఫరెంట్ స్టోరీస్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న అడివి శేష్ మేజర్ తో మరోసారి ప్రేక్షకులకు కొత్త థ్రిల్ అందించడానికి వస్తున్నాడు. జూలై 2న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా టీజర్ ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు రిలెజ్ అవుతుంది.

ఈ టీజర్ ను తెలుగు, హిందీ, మళయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు టీజర్ ను సూపర్ స్టార్ మహేష్, హిందీ టీజర్ ను బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, మళయాళ టీజర్ ను పృధ్వి రాజ్ సుకుమారన్ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూడు భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. టీజర్ ని కూడా ముగ్గురు సూపర్ స్టార్స్ తో రిలీజ్ చేస్తున్నారు. అడివి శేష్ మేజర్ కు ఇది గుడ్ స్టార్ట్ అని చెప్పొచ్చు. టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేలా చూస్తున్నా చిత్రయూనిట్.

Read more RELATED
Recommended to you

Latest news