థర్టీ ఇయర్స్ పృధ్విని విలన్ చేస్తున్నారట

-

ఖడ్గం సినిమాలో థర్టీ ఇయర్ ఇండస్ట్రీ అంటూ చెప్పిన పృధ్వి రాజ్ ఆ డైలాగ్ తోనే చాలా పాపులర్ అయ్యాడు. తన మార్క్ కామెడీతో అలరిస్తూ వస్తున్న పృధ్వి రాజ్ లోని మరో కోణం ను చూపించడానికి రెడీ అయ్యాడు మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్. అరవింద సమేత సినిమా తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న త్రివిక్రం శ్రీనివాస్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.

ఆ సినిమా కూడా తండ్రి కొడుకుల మధ్య సెంటిమెంటల్ మూవీ అని అంటున్నారు. ఇదిలాఉంటే ఈ సినిమాలో విలన్ గా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్విని సెలెక్ట్ చేశారట. అయితే మెయిన్ విలన్ గా కాదు కాని నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ లో పృధ్వి కనిపిస్తారట. ఇన్నాళ్లు కమెడియన్ గా క్రేజ్ తెచ్చుకున్న పృధ్వి విలన్ గా ఎలా మెప్పిస్తాడో చూడాలి. అయితే కమెడియన్ పృధ్విని నెగటివ్ గా చూపించాలన్న ఆలోచనే కొత్తగా ఉంది. మరి విలన్ గా పృధ్వి ఎలా చేస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version