కుబేర సినిమాకు అదిరిపోయే న్యూస్. కుబేర సినిమాకు ఏపీలో టికెట్ ధరలు పెంచారు. ఈ నెల జూన్ 20న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ తరుణంలోనే టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో రూ.75 (జీఎస్టీ అదనం) వరకూ పెంచుకునే వెసులుబాటు కల్పించనున్నారు. సినిమా విడుదలైన తేదీ నుంచి 10 రోజుల పాటు అమల్లో పెంచిన ధరలు ఉండనున్నాయి.
కాగా స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల చాలా రోజుల తరువాత తెరకెక్కిస్తున్న మూవీ కుబేర. ఈ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. ఇందులో అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న వంటి తారాగణం నటిస్తున్నారు.