రేపు ఓటు హక్కు వినియోగించుకోనున్న టాలీవుడ్‌ సెలబ్రీటీలు..ఎక్కడంటే ?

-

రేపు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు టాలీవుడ్‌ సెలబ్రీటీలు. ఓబుల్‌రెడ్డి స్కూల్‌ లో జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రణతి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ జూబ్లీహిల్స్ లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి ,అల్లు అరవింద్, అల్లు శిరీష్‌ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ లో మహేశ్‌బాబు, నమ్రత , మంచు మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్‌, విజయ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ ,శ్రీకాంత్‌ , జీవిత రాజశేఖర్ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

Tollywood celebrities who will exercise their right to vote tomorrow

ఎఫ్‌ఎన్‌సీసీ లో రాఘవేంద్రరావు, జీవిత, రాజశేఖర్‌ , విశ్వక్‌సేన్‌ , దగ్గుబాటి రాణా, సురేశ్‌ బాబు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జూబ్లీహిల్స్‌ క్లబ్‌ లో చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన , నితిన్‌, జూబ్లీ హిల్స్ న్యూ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ లో రవితేజ, వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌ లో నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్‌ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

మణికొండ హైస్కూల్ లో వెంకటేశ్, బ్రహ్మానందం, షేక్ పేట్ ఇంటర్నేషనల్ స్కూల్ రాజమౌళి రామారాజమౌళి, బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలని లో హీరో రామ్ పోతినేని, గచ్చిబౌలి జిల్లా పరిషత్ పాఠశాల లో హీరో నాని ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. దర్గా గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ లో హీరో సుధీర్ బాబు, రోడ్‌ నెం.45, జూబ్లీహిల్స్‌ –ఆర్థిక సహకార సంస్థ: అల్లరి నరేశ్‌, యూసఫ్‌గూడ చెక్‌పోస్టు ప్రభుత్వ పాఠశాలలో తనికెళ్ల భరణి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version