టాలీవుడ్‌లో విషాదం : ప్రముఖ సంగీత దర్శకుడు మృతి

-

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం…చోటు చేసుకుంది.

సంగీత దర్శకుడు ఎస్పీ ఈశ్వరరావు అనారోగ్యంతో చెన్నైలో మృతి చెందారు. ప్రముఖ సంగీతదర్శకుడు ఎస్.పి.కోదండపాణి కుమారుడు ఈయన. ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు సంగీత సహకారం అందించారు. అలా గే అంతపురం శుభలేఖ జీవితం లాంటి సినిమాలతో పాటు ఈటీవీ సీరియళ్లకు సంగీత దర్శకుడి గా ఆయన వ్యవహరించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈశ్వరరావు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇక ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news