రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ ట్రైలర్ వచ్చేసింది.. వీక్షించారా..?

-

టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. నామ్ తో సునా మోగా అనేది ఈ చిత్రానికి ట్యాగ్ లైన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. భాగ్య శ్రీ బోర్సె హీరోయిన్ గా నటిస్తోంది. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇంకా విడుదలకు 8 రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రమోషన్స్ శరవేగంగా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసింది చిత్ర  బృందం. 

సరిహద్దును కాపాడే వాడే సైనికుడు కాదు.. సంపద కాపాడే వాడు కూడా సైనికుడు అనే రవితేజ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. పాత కాలం స్కూటర్, రేడియో, క్యాసెట్ వంటివి కనిపించడం చూస్తుంటే.. ఈ మూవీ పాతకాలానికి సంబంధించిన కథగా కనిపిస్తోంది. రవితేజ ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్టుమెంట్ లో వర్క్ చేస్తుంటాడు. ఇందులో యాక్షన్ సీన్లు చాలా బాగున్నాయి. కామెడీ కూడా బాగానే ఉన్నట్టు తెలుస్తోంది. విలన్ గా జగపతి బాబు యాక్టింగ్ అదుర్స్ అనే చెప్పాలి. మొత్తానికి పాత రవితేజను చూసిన ఫీలింగ్ కలుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news