రైతులకు గుడ్ శుభవార్త.. సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారు

-

ఉమ్మడి ఖమ్మం రైతులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఖమ్మం జిల్లా రైతులు ఎన్నో ఏళ్ల నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారు అయింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభించనున్నట్టు తాజాగా రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

నీటి పారుదల శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్ముగూడెంలో నిర్మించిన సీతారామ ప్రాజెక్ట్ ను ఆగస్టు 15న ప్రారంభించనున్నట్టు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు సీఎం రేవంత్ రెడ్డి గోల్కొండ కోటలో జెండా ఎగురవేసిన తరువాత హెలికాప్టర్ ద్వారా నేరుగా ఖమ్మం జిల్లాకు చేరుకుంటారు. ీతారామ ప్రాజెక్ట్ పంపు హౌస్ లను ప్రారంభిస్తారు. అనంతరం  వైరాలో జరుగనున్న భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఉమ్మడి ఖమ్మం రైతుల కల త్వరలోనే నెరవేరబోతుందని స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news