వికెట్ కీపర్ బాగుండాలి !హీరోయిన్ ఊర్వశి రౌతాలే !

-

మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత సమాజం చాలా మారిపోయింది. అంతకు ముందు టీవి ఛానెల్స్ తోటి సగం బ్రష్టు పట్టింది. ఇప్పుడు పూర్తిగా మరింత దారుణంగా తయారైంది. ఇక బాలీవుడ్ వాళ్ళు ఈ విషయంలో విప్పడంలో మనకంటే పది అడుగులు ముందు ఉన్నారు. వాళ్లు చేసే హాట్ ఫోటో సూట్స్, అంగాంగ ప్రదర్శనకు లెక్కే లేదు. ఇక ఏలా అయినా కూడా ఫేమస్ అయిపోదామని కొన్ని చిల్లర పనులు చేస్తూ ఉంటారు.

అలాంటి వారిలో వివాదాస్పద అందెగత్త  ఊర్వశి రౌతాలే ఒకరు. ఆమె రీసెంట్ రోజులలో టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ వెనక పడుతూ లైమ్ లైట్ లో ఉండటానికి తెగ ట్రై చేస్తోంది. ఆమెను సోషల్ మీడియాలో నెటిజన్స్ ఎన్ని బూతులు తిట్టినా కూడా మళ్లీ మళ్లీ అవే కామెంట్స్, పోస్టులు పెడుతూ హంగామా చేస్తూ ఉంటుంది. ఇక రీసెంట్ గా పంత్ ఆస్ట్రేలియా వెళితే అక్కడకు వెళ్లి ఫ్యాన్స్ తో చివాట్లు తింది.

ఇక తాజాగా టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ సొంత ఊరు రూర్కి వెళుతూ కారు ప్రమాదం లో గాయ పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. టీమ్ ఇండియా అభిమానుల అందరూ ఆయన బాగుండాలని ప్రార్దనలు చేస్తున్నారు. తాజాగా ఊర్వశి రౌతేలే కూడా  ‘ప్రార్ధిస్తున్నాను’ అని ఓ పోస్ట్ చేసింది. దీంతో ఆ పోస్ట్ పంత్ కోసమే పెట్టినట్లు మీడియాలో హైలైట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version