‘బేబీ’ హీరోయిన్ జోరు.. ఇద్దరు యంగ్ హీరోల సినిమాల్లో ఛాన్స్

-

‘బేబి’ సినిమాతో టాలీవుడ్​ను తనవైపు తిప్పుకుంది యూట్యూబర్ వైష్ణవి చైతన్య. తొలి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపి.. విమర్శకులను కూడా తన నటనతో మెప్పించింది. ఈ సినిమా సక్సెస్​తో వైష్ణవి ఫేటే మారిపోయింది. ఇప్పుడు వైష్ణవికి సినిమా ఆఫర్లు క్యూ కట్టేస్తున్నాయి. ఫుల్ జోరు మీదున్న ఈ బ్యూటీకి తాజాగా ఇద్దరు యంగ్ హీరోలతో జతకట్టే ఛాన్స్ వచ్చింది. ఇంతకీ ఆ హీరోలు ఎవరంటే..?

యువ కథానాయకులు సిద్ధు జొన్నలగడ్డ, ఆశిష్‌ సినిమాల్లో కథానాయికగా వైష్ణవి చైతన్య ఎంపికైంది. సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో ఇటీవలే ఓ చిత్రం మొదలైన విషయం తెలిసిందే. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాత. ఇందులో కథానాయికగా వైష్ణవి చైతన్యని ఎంపిక చేశారు. ఆశిష్‌ కథానాయకుడిగా అరుణ్‌ భీమవరపు దర్శకత్వంలో చిత్రం కూడా ఇటీవలే మొదలైంది. దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ పతాకంపై హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగార్జున మల్లిడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకీ వైష్ణవి చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news