వెంకటేష్ ‘సైంధవ్’ కి సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇచ్చిందంటే..?

-

విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న ఆయన కెరీర్ లోని 75వ మూవీ సైంధవ్. ఎట్టకేలకు సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ మూవీ చూసిన సెన్సార్ అధికారులు పెద్దల సమక్షంలో పిల్లలు కూడా చూసేవిధంగా U/A సర్టిఫికేట్ జారీ చేశారు. సెన్సార్ ఫార్మాలిటీ కూడా పూర్తవ్వడంతో సైంధవ్ 2024 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉన్నట్టు హింట్ ఇచ్చినట్టు అయింది. సైంధవ్ యూనిక్ యాక్షన్ ఫ్యాక్డ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ అని మేకర్స్ పేర్కొంటున్నారు.

ఈ సినిమాలో తండ్రీ, కూతుళ్ల మధ్య బంధం సినిమాలో ప్రధాన అంశంగా చెబుతున్నారు. వెంకటేష్, శ్రద్ధా శ్రీనాథ్ కి మధ్య మెచ్యూర్ రిలేషన్ షిప్ కూడా మనం చూడవచ్చు. తన కూతురితో కలిసి సింగిల్ పేరెంట్ ఉన్న వెంకటేష్ కి సహాయం చేసేందుకు శ్రద్ధా శ్రీనాథ్ వస్తుంది. పాన్ ఇండియా మూవీని నిహారిక ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి భారీ స్థాయిలో నిర్మించారు. సంతోష్ నారాయణ సంగీతం అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news