Virupaksha : ‘విరూపాక్ష-2’ సినిమాపై క్రేజీ అప్డేట్

-

మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ దాదాపు యాక్సిడెంట్ తర్వాత ఒక రెండు సంవత్సరాలు విరామం తీసుకుని మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం విరూపాక్ష. ఈ సినిమా థియేటర్లలో ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.సాయి ధరమ్ తేజ్ హీరోగా మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన చిత్రం ఇది.

ఈ సినిమాలో ఊహించిన విధంగా ట్విస్టులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా వెండితెరపై ఊహించని విధంగా సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు అంతకుమించి కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోయింది. ఇక ఇప్పుడు విరూపాక్ష పార్ట్‌ 2 సినిమా షూటింగ్‌ పై క్రేజీ అప్డేట్‌ ఇచ్చింది చిత్ర బృందం. ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కాబోతుందని పేర్కొంది చిత్ర బృందం. ఈ మేరకు ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news