ఎట్టకేలకు ఒక ఇంటివాడైన వైవా హర్ష..!!

-

ప్రముఖ కమెడియన్, యూట్యూబర్ గా వైవా హర్ష మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.. ఎన్నో చిత్రాలలో కమెడియన్ గా కూడా నటించి మంచి క్రేజీ సంపాదించిన వైవా హర్ష తాజాగా తన కల సహకారం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.. తన భార్యతో కలిసి గృహప్రవేశం చేయడం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. ఈ గృహప్రవేశానికి మెగా హీరో సాయి ధరంతేజ్ అతిథిగా వచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరీ మధ్య ఉన్న స్నేహబంధం కారణంగానే సాయి ధరంతేజ్ హర్ష గృహప్రవేశానికి వచ్చినట్లు తెలుస్తోంది..ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉండడంతో పలువురు అభిమానుల సైతం వైవా హర్షకి కంగ్రాట్స్ చెబుతూ ఉన్నారు.

యూట్యూబర్ గా తన కెరీర్ ని ప్రారంభించిన హర్ష సరికొత్త కాన్సెప్ట్లతో వీడియోని తీసి మంచి పాపులారిటీ అయ్యారు. అప్పటినుంచి తన పేరు వైవ హర్ష గా పాపులర్ అయింది.. 2014లో మైనే ప్యార్ కియా అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన కలర్ ఫోటో చిత్రంలో తన నటనతో మంచి మార్కులను సంపాదించుకున్నారు. ఇప్పటివరకు కమెడియన్ గా హీరోల స్నేహితుడు పాత్రలలో నటించిన వర్ష సుందరం మాస్టర్ సినిమాతో హీరోగా మారబోతున్నారు.

ఎట్టకేలకు తాను కన్న సొంత ఇంటి కల నెరవేరిందని ఆనందంలో వైవాహర్ష ఈ ఫోటోలను షేర్ చేసినట్టుగా తెలుస్తోంది. పెళ్లి అయిన తర్వాత తన భార్య మీద ఉన్న ప్రేమను చూపిస్తూ పలు రకాల పోస్టులు చేస్తూ ఉండేవారు. వైవ హర్ష ఇటివలె వచ్చిన బేబీ సినిమాలో కూడా తన నటనతో అందరిని ఆకట్టుకున్నారు. ముఖ్యంగా వైవాహర్ష చిరంజీవి స్నేహితుడు కుమారుడు అనే విషయాన్ని స్వయంగా చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news