ఘనంగా ఘట్టమనేని కుటుంబంలో పెళ్లి సందడి.. ఫోటోలు వైరల్..!

-

తాజాగా ఘట్టమనేని వారి కుటుంబంలో ఎంతో వైభవంగా వివాహ వేడుక జరిగింది. మహేష్ బాబు సమీప బంధువుల కుటుంబంలో ఈ పెళ్లి వేడుక జరగడంతో మహేష్ బాబు కుటుంబంతో పాటు పలువురు సినీ, రాజకీయ నేతలు ఈ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఘట్టమనేని వరప్రసాద్ , అపర్ణ ల కూతురు అయిన డాక్టర్ దామిని వివాహం హైదరాబాదులో చాలా ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు మహేష్ బాబు హాజరై వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.. ఇక ఈ క్రమంలోనే ఈ పెళ్లి వేడుకలలో భాగంగా సీనియర్ నటి ప్రస్తుత ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా కూడా పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

పెళ్లి జరిగిన అనంతరం మహేష్ బాబును కలిసి రోజా కొంత సమయం పాటు మహేష్ బాబుతో కొన్ని విషయాలను చర్చించడమే కాకుండా ఆయనతో కలిసి సెల్ఫీలు దిగారు. ఆ ఫోటోలను రోజా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోవడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ గా మారుతున్నాయి. ఇదిలా ఉండగా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించిన మంచి సక్సెస్ అందుకున్న రోజా ఆ తర్వాత బుల్లితెరపై పలు షోలలో జడ్జిగా వ్యవహరించారు. రాజకీయాలలో కూడా చక్రం తిప్పుతున్న ఈమె తాజాగా మంత్రి పదవి అప్పజెప్పడంతో బుల్లితెరకు దూరమై రాజకీయాలలో బిజీగా కొనసాగుతున్నారు.

ఇక మరొకవైపు మహేష్ బాబు, త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఆయన రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఒక అడ్వెంచర్ మూవీలో నటించబోతున్న విషయం తెలిసిందే. మొత్తానికైతే ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Roja Selvamani (@rojaselvamani)

Read more RELATED
Recommended to you

Latest news