బ్రహ్మ దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా ..!

-

విష్ణు మూర్తి శపించడం వల్ల బ్రహ్మ ని ఎవరూ పూజించరు అనేది పురాణాతిహాసం. ప్రపంచంలో ఒకే ఒక్క బ్రహ్మ దేవాలయం భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో, అజ్మీర్ జిల్లాలో, పుష్కర్ అనే ఊరులో ఉంది.. ఇక్కడే పుష్కర నది ఒడ్డున బ్రహ్మ దేవాలయం ఉంది. ఉత్తర భారత దేశంలో ఉన్న అయిదు పవిత్ర ధామములలో ఇది ఒకటి.

ఈ నగర నిర్మాణం ఎప్పుడు మొదలైందో ఎవరికీ తెలియదు. పురాణాల ప్రకారం ఈ నగరం యొక్క రూప కర్త బ్రహ్మ దేవుడని తెలుస్తుంది. బ్రహ్మ దేవుడు విష్ణు మూర్తి గురించి అరవై వేల సంవత్సరాలు యజ్ఞం చేసాడని ప్రతీతి. ఈ గుడి క్రి.శ 14 వ శతాబ్దంలో నిర్మించారు. ఇక్కడ గాయత్రి, సరస్వతి లతో చతుర్ముఖ బ్రహ్మ దేవుడు నయనానందకరంగా ఉంటాడు.

ద్వాపరయుగంలో వజ్రనాభుడు అనే రాక్షసుడిని వధించటానికి బ్రహ్మ తన ఆయుధమైన తామర పుష్పాన్ని ప్రయోగించగా కొన్ని తామర రేకులు భూమి మీద పడ్డాయట. ఆ రేకులు పడిన ప్రదేశమే పుష్కర సరస్సుగా చెపుతారు. ఈ ప్రాంతంలోనే బ్రహ్మ యజ్ఞం చేసాడని అందుకే ఆ ప్రాంతానికి అంత ప్రాధాన్యత వచ్చింది అని చెపుతారు. ఈ ఆలయం రెండువేల సంవత్సరాల క్రితం నిర్మించినట్టు చరిత్ర చెపుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news