అష్టాదశ పీఠం ప్రయాగ మాధవేశ్వరీ !

-

అమ్మవారి అష్టాదశ పీఠాలు అంటే తెలియని వారు ఉండరు. పవిత్రమైన అష్టాదశపీఠాల్లో ఒకటైన మాధవేశ్వరి దేవాలయ విశేషాలు దాని వెనుక గాథను తెలుసుకుందాం…

పూర్వం… దక్షుడు తలపెట్టిన యాగానికి అల్లుడైనా పరమ శివుని పిలవడు. ఎందుకంటే.. ఏదో ఓ సందర్భంలో శివుడు తనని చూసి కూడా పలకరించకపోవడంతో దక్షుడు ఆగ్రహానికి గురవుతాడు. అందుకు ప్రతీకారంగానే ఆయన శివుడిని ఆహ్వానించడు. అటు.. ఆహ్వానం అందకపోయినప్పటికీ శివుని సతి పార్వదీదేవి తన తండ్రి దక్షుడు తలపెట్టిన యాజ్ఞానికి వెళ్లగా.. అక్కడ ఆమెను ఎవ్వరూ పలకరించరు. అలాగే తన భర్తకు జరిగిన అవమానాన్ని భరించలేకపోయిన పార్వతీ.. అప్పటికప్పుడే  యోగాగ్నిలో దూకి తనువు చాలింది. అది తెలిసిన శివుడు.. సతీ వియోగాన్ని భరించలేక దక్షయజ్ఞను నాశనం చేయడం కోసం వీరభద్రుణ్ణి సృష్టిస్తాడు.

అదే సమయంలో సతీదేవిని తన శరీరం భుజాన వేసుకుని దుఃఖంతో పరిశ్రమించడం మొదలుపెడతాడు. లోక రక్షణకోసం శివుణ్ణి యధాస్ధితికి తీసుకురావటానికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తాడు. ఆ భాగాలు 101 ప్రదేశాలలో పడ్డాయి. ఆ భాగాల్లో తొలుత 56 ముఖ్యమైనవిగా పేరుగాంచాయి కానీ.. కాలాంతరంలో 18 మాత్రమే ప్రముఖంగా నిలబడ్డాయి. వాటినే అష్టాదశ పీఠాలు అంటారు. అటువంటి వాటిలో శ్రీ మాధవేశ్వరీ దేవి ఆలయం ఒకటి. ఇక్కడ అమ్మవారి ముంజేయి పడింది. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఏమీ వుండదు కానీ.. ఒక నలుచదరం పీఠంలాగా వుంటుంది. దానిపైన ఒక గుడ్డ హుండీ వేలాడదీసి నట్లుంటుంది.  దానికింద ఒక ఉయ్యాల.  భక్తులు తాము తీసుకెళ్ళిన కానుకలను ఆ ఉయ్యాలలో వుంచి మొక్కుకోవాలి.

మాధవేశ్వరీదేవి ఆలయం అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడే ‘ప్రయాగ’లో వుంది. గంగ, యమున, సరస్వతి నదుల కూడలి ప్రదేశం ప్రయాగ.  ఈ నదుల సంగమాన్ని త్రివేణీ సంగమం అని అంటారు.  ఈ సంగమంలో స్నానం చేయటం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. కాశీ తీర్ధయాత్ర చేసినవారు, ప్రయాగలో త్రివేణీ సంగమ స్నానం తప్పక ఆచరిస్తారు. అలాగే ఈ యాత్ర చేసినవారు గంగా తీర్ధం ఈ త్రివేణీ సంగమంనుంచి మాత్రమే ఇంటికి తీసుకు వెళ్ళాలి. ఇక్కడివారు శ్రీ మాధవేశ్వరీ దేవిని అలోపీదేవిగా వ్యవహరిస్తారు.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news