Vasthu Tips: ఈ వస్తువులు ఎవరికైన ఇస్తే ఆర్ధిక, ఆరోగ్య సమస్యలు తప్పవు!

-

మనం మన వస్తువులను అప్పుడప్పుడు ఇతరులకి ఇవ్వడం సర్వసాధారణం. అయితే కొన్ని రకాల వస్తువులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులతో పంచుకోకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇలా ఇతరులకు ఇచ్చారంటే ఆర్థికంగా, ఆరోగ్యంగా సమస్యలు ఎదుర్కోక తప్పదని నిపుణులు చెబుతున్నారు.కొన్ని రకాల వస్తువులను ఇతరులకి ఇస్తే మీ ఆర్థిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మొక్కలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులకు ఇవ్వకూడదు. ఎందుకంటే మీ ఇంట్లో పెరుగుతున్న మొక్కలను ఇతరులకు ఇస్తే మీ ఇంట్లోని శక్తిని ఇతరులకు ఇచ్చినట్లు అవుతుందట. అందుకే మొక్కలను వీలైనంత వరకు నర్సరీల్లో కొనుగోలు చేసుకోవడమే మంచిది. ఇలా మొక్కలను తీసుకున్న వారికి కూడా మంచిది జరగదని నిపుణులు చెబుతున్నారు.చాలా మంది ఇంట్లోని ఉప్పును, పసుపుని అరువిస్తారు.కానీ ఎట్టి పరిస్థితుల్లో పక్కని వారికి అరువుగా ఇవ్వకూడదని పండితులు చెబుతున్నారు. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితిపై కచ్చితంగా ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఉప్పును కానీ పసుపును కానీ ఎవరికీ కూడా అరువు ఇవ్వకూడదు.

జ్యోతిష్య పండితుల అభిప్రాయం ప్రకారం చెప్పులు, బూట్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి ఇవ్వకూడదు. ఎందుకంటే కాళ్లు శని దేవుడి స్థానంగా చెబుతుంటారు. అందుకే ఒకరి చెప్పులను మరొకరు ధరించడం వల్ల శని దోషాన్ని ప్రేరేపిస్తుందని నిపుణులు చెబుతుంటారు. దీని వల్ల పేదరికం, ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని నిపుణులు చెబుతున్నారు.అలాగే ఇక ఇతరులతో పంచుకోకూడని మరో వస్తువు ఆభరణాలు. ముఖ్యంగా బంగారం అభరణాలను మరొకరికి ఇవ్వడం వల్ల మీ సంపద కచ్చితంగా వారికి ఇచ్చినట్లవుతుందని పండితులు చెబుతున్నారు.నిపుణులు అభిప్రాయం మీ పెన్నును ఇతరులతో పంచుకోకూడదని చెబుతున్నారు. మీ జేబులోని పెన్నును పక్కనివారికి ఇవ్వడం వల్ల మీ ఆర్థిక పరిస్థితిపై కచ్చితంగా ప్రభావం పడుతుందని చెబుతుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news