వాస్తు చిట్కాలను ఇంట్లో పాటించడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. వాస్తు శాస్త్రంలో చెప్పిన నియమాలు ఎంతో ప్రయోజనం అని చెప్పవచ్చు. ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం ఉండాలంటే తప్పకుండా వాస్తు నియమాలను పాటించాల్సిందే. ముఖ్యంగా, ఆర్థిక సమస్యలను తగ్గించుకోవడానికి ఈ వాస్తు నియమాలు ఉపయోగకరంగా ఉంటాయి. ఇంట్లో మొక్కలను పెంచడం వలన ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది, ఇంట్లో అందమైన పూల మొక్కలను పెంచడానికి అందరూ ఇష్టపడతారు, ఎందుకంటే అవి మన ఇంటికి అందమైన వాతావరణాన్ని అందిస్తాయి. అటువంటి పూల మొక్కలలో మందార పువ్వులు కూడా ఒకటి.
ఈ పూలు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమని అందరు నమ్ముతారు. సరైన దిశలో మందార మొక్కను పెంచడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మందార పువ్వుకు దైవ శక్తిని ఆకర్షించే శక్తి ఉంది అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కనుక, ఈ మొక్కను ఇంట్లో పెంచడం వల్ల దోషాలు తొలగిపోతాయని, సంపద పెరుగుతుందని భావించబడుతుంది. తూర్పు లేదా ఉత్తర దిశలో మందార మొక్కను పెంచడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఈ రెండు దిశల్లో మొక్కను పెంచడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని, ఇంట్లో సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు. సహజంగా పల్లెటూర్లలో మందార పూలు ఎక్కువగా పెంచుతారు.
కనుక వాస్తు ప్రయోజనాలను పొందాలంటే ఇంట్లో మందార మొక్కను తప్పకుండా పెంచండి, లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందండి. ఆర్థిక సమస్యలను తగ్గించుకోవాలంటే శుక్రవారం రోజున డబ్బు నిల్వ చేసే ప్రదేశంలో మందార పూలను ఉంచండి. అలాగే వీటితో గణపతిని, దుర్గాదేవిని ప్రార్థించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఏడు రోజుల పాటు ఈ పద్ధతిని పాటించడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కనుక ఈ నియమాలను పాటించడం ద్వారా ఎంతో మంచి వాతావరణాన్ని సృష్టించుకోవచ్చు మరియు ఆనందంగా జీవించొచ్చు.