వాస్తు: పిల్లల్లో ఏకాగ్రతని ఇలా పెంచచ్చు..!

-

వాస్తు ప్రకారం అనుసరించడం వల్ల ఎలాంటి సమస్యలనైనా తొలగించుకోవచ్చు. అదే విధంగా ఏ సమస్య లేకుండా ఆనందంగా ఉండడానికి కూడా అవుతుంది. ఈరోజు ఎన్నో అద్భుతమైన వాస్తు చిట్కాలని పండితులు మనతో షేర్ చేసుకోవడం జరిగింది. వాటిని కనుక మీరు అనుసరించారు అంటే ఖచ్చితంగా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అయితే మరి పండితులు చెప్పిన అద్భుతమైన చిట్కాల గురించి ఒకసారి చూసేద్దాం.

పిల్లల్లో ఏకాగ్రతను పెంచడానికి అద్భుతమైన చిట్కాలని పండితులు అందించారు. వీటితో పిల్లలు ఏకాగ్రత పెరుగుతుంది. పిల్లలు ప్రశాంతంగా చదువుకోవాలన్నా, ఏకాగ్రత పెరిగి మంచిగా మార్కులు తెచ్చుకోవాలన్నా వీటిని అనుసరిస్తే మంచిది. వాస్తు శాస్త్రం ప్రకారం వాస్తు దోషాలను తొలగించుకోవడానికి మన ఇంట్లో ఉండే రంగులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

రంగును బట్టి వాతావరణం అనేది ఏర్పడుతుంది. కాబట్టి పిల్లల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల్లో ఏకాగ్రత పెరగాలంటే పిల్లలు చదువుకునే గదిలో రంగులను మార్చాలి. వాస్తు ప్రకారం పిల్లల గది లో క్రీమ్ కలర్, లైట్ పర్పల్, ఆకుపచ్చ, స్కై బ్లూ, లైట్ పింక్ వంటివి వేస్తే మంచిది.

అలాగే పసుపు కూడా చదువుకోడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఆకుపచ్చ కూడా జ్ఞానానికి చిహ్నం. కాబట్టి పిల్లల గదిలో ఈ రంగు ఉంటే మంచిది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఫాలో అయితే కచ్చితంగా పిల్లలు బాగా చదువుకోవడానికి వాళ్లల్లో ఏకాగ్రత పెరగడానికి అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news