శ్రీలక్ష్మీపూజ ఇలా చేస్తే ధనమే ధనం !

-

ధనం మూలం ఇదం జగత్‌. ధనం కోసం మనుషులు పడే పాట్లు అన్ని ఇన్నికాదు. అయితే ధనం అవసరమైనంత లేక చాలామంది ఇబ్బందులు పడుతారు. శ్రీలక్ష్మీ దేవి పూజతో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడొచ్చు. ఇంట్లో ధనం నిలువాలన్న, సమృద్ధిగా ధనం కావాలన్న పెద్దలు చెప్పిన ఈ చిన్న పూజను భక్తితో, శ్రద్ధతో చేసి ఫలితాలను మీరే చెక్‌ చేసుకోండి…


ఏదైనా ఒక మంచి రోజు .. రాత్రి 10 గంటల తరవాత ఎదురుగా బల్లపై ఒక కలశం ఉంచాలి. ఈ కలశంపై కుంకుమపువ్వుతో ఒక స్వస్తిక గుర్తును చిత్రించి, అందులో నీరు నింపాలి. ఆ నీటిలో గరిక, అక్షతలు ఒక రూపాయి నాణెం వేయాలి. తరవాత చిన్నపళ్లెంలో బియ్యం పోసి, ఆ కలశంపై ఉంచాలి. దానిపై ఒక స్ఫటిక శ్రీయంత్రం స్థాపించాలి. ఆ కలశం దగ్గర నాలుగు ముఖాల దీపం వెలిగించి అక్షతలు, కుంకుమతో పూజించాలి.

అనంతరం శ్రీ లక్ష్మీదేవిని 10 నిముషాలు ధ్యానించాలి. ఆ గృహంలో ధన సంబంధ సమస్యలు తొలగి, ఆర్థిక వృద్ధి కొనసాగుతుంది. అంతేకాకుండా అవకాశం దొరికినప్పుడల్లా పేదలకు, ఐదురూపాయల అన్నం పెట్టే దగ్గర మీ చాతనైనంత సహాయం చేయండి. వికలాంగులు, వీధులు ఊడ్చేవారు కనపడితే- వారికి కొంత డబ్బులు ఇవ్వండి. దీనివల్ల కుటుంబంలో సుఖ సమృద్ధి. ప్రతీ శుక్రవారం శ్రీసూక్తపారాయణం, అది రానివారు శ్రీలక్ష్మీ అష్టోతరం చదవండి. దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయి.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news