రేపటి నుంచి మేడారం హుండీల లెక్కింపు

-

హన్మకొండలోని టిటిడి కల్యాణ మండపంలో రేపటి(బుధవారం) నుంచి మేడారం జాతర హుండీలను లెక్కించనున్నారు. 497 హుండీలను సోమవారం రాత్రి వరకు తరలింపు పూర్తిచేశారు. ఈ లెక్కింపును 1000 మంది దేవాదాయ, రెవెన్యూ, పోలీస్, స్వచ్ఛంద కార్మికులను నియమించారు. ఆభరణాల కానుకలు బియ్యం నుంచి వేరు చేసేందుకు జల్లడలను ఏర్పాటు చేశారు. టిటిడి కల్యాణ మండపం చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news