21న యాదాద్రికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

-

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయాన్ని ఈ నెల 21న దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉదయం 11గంటలకు శ్రీస్వామి వారిని బాలాలయంలో దర్శించుకున్న అనంతరం ప్రధానాలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించనున్నట్లు వెల్లడించారు. అనంతరం ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులపై వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావుతో కలిసి ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version