కోదాడ కోర్ట్‌ను పరిశీలించిన జిల్లా జడ్జి

-

కోదాడలో నూతన కోర్టు భవన నిర్మాణానికి వీలైనంత తొందరలో శంకుస్థాపన చేసే విధంగా కృషి చేస్తానని ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జగ్జీవన్ కుమార్ అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని కోర్టు హాలును పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సమస్యలను జడ్జి దృష్టికి తీసుకెళ్లారు .కోర్టు భవనం, వాష్ రూములు పార్కింగ్ స్థలం సమస్యలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news