నల్గొండ : పోలీసు స్టేషన్‌లోనే పెట్రోల్ పోసుకొని..

-

కుమారులు వేధిస్తున్నారని ఓ తల్లి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన చౌటుప్పల్ పీఎస్ ఆవరణలో బుధవారం చోటు చేసుకుంది. చౌటుప్పల్ మండలం జైకేసారానికి చెందిన అండాలు తన కుమారులు వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఠాణాకు కొడుకులను పిలిపించి మాట్లాడుతున్న క్రమంలో ఆమె పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఆమెను చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news