వరంగల్ : ఆదివాసీల జోలికి వెళ్తే సహించేది లేదు- మంత్రి సత్యవతి

-

జీవనాధారం కోసం అడవిలోకి వెళ్లే ఆదివాసీల జోలికి వెళ్తే సహించేది లేదని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివాసీ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రాచన్నగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఆదివాసీ గూడెం, సాకివాగుకు చెందిన ముగ్గురు ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ బీట్ గార్డులు అమానుషంగా ప్రవర్తించారన్న సంఘటనపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news