యాదాద్రి: హామీని నెరవేర్చిన జిల్లా కలెక్టర్

-

గత సంవత్సరం నవంబర్ 30న గౌస్ నగర్‌కు చెందిన విద్యార్థినులు గౌస్ నగర్ నుండి బండసోమారం ZPHSకు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మార్గమధ్యంలో వారిని గమనించి పలకరించారు. 3 కి.మీ. నడిచి వెళ్తున్న విద్యార్థినుల అవస్థ చూసి సైకిల్ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా మంజూరైన సైకిళ్లను సోమవారం ఆమె ముగ్గురు విద్యార్థినులకు బహూకరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version