నల్గొండ: పట్టపగలే దొంగల హల్ చల్

-

నల్గొండ పట్టణంలో సోమవారం పట్టపగలే దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. NG కళాశాల వెనుక భాగం శ్రీనగర్ కాలనీలో గల నాగులవంచ స్వామి నివాసంలో గుర్తు తెలియని దుండగులు బీరువా పగలగొట్టి 2 తులాల బంగారం చోరీ చేశారు. ఉదయం 9 గంటలకు బయటకు వెళ్లిన స్వామి కుటుంబ సభ్యులు సాయంత్రం ఇంటికి చేరుకున్నారు. బీరువా పగులగొట్టి ఉండడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news