ఆదాయం పెంచుకునే ప‌నిలో ప‌డ్డ కేంద్రం.. ప‌న్నుల బాదుడుకు రంగం సిద్ధం..?

-

క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కే కాదు.. అటు కేంద్రానికి కూడా చాలా ఆదాయం త‌గ్గిపోయింది. దీంతో ఇప్పుడు కేంద్రం ఆదాయం పెంచుకునే మార్గాల‌ను అన్వేషిస్తోంది. అందులో భాగంగానే ఓ ప్ర‌త్యేక బృందాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ క్ర‌మంలోనే ఆ బృందాన్ని ఫోర్స్ టీం అని పిలుస్తున్నారు. ఇక ఈ టీం కేంద్రానికి ఆదాయం పెంచుకునేందుకు గాను ప‌లు మార్గాల‌ను సూచించింది. అవేమిటంటే…

indian government eyes to increase revenue

* సూప‌ర్ రిచ్ అయిన వ్య‌క్తుల‌పై ట్యాక్సింగ్ ది వెల్దీ పేరిట 40 శాతం ప‌న్ను విధించ‌నున్నారు. దీంతో కేంద్రానికి భారీగా ఆదాయం రానుంది.

* విదేశాల‌కు చెందిన కంపెనీలు భార‌త్‌లో సంపాదించే సొమ్ముపై ఇప్ప‌టి వ‌ర‌కు 2 శాతం స‌ర్‌చార్జి విధించారు. ఇక‌పై ఇది 5 శాతం కానుంది. దీంతో కేంద్రానికి భారీగా ఆదాయం ల‌భ్యం కానుంది.

* ప్ర‌స్తుతం ప్ర‌జ‌లు చెల్లించే ప‌న్నుల్లో ఎడ్యుకేష‌న‌ల్ సెస్ 2 శాతంగా ఉంది. దీన్ని 4 శాతానికి పెంచ‌నున్నారు. కోవిడ్ రిలీఫ్ సెస్ పేరిట వ‌న్‌టైం కింద ఈ సెస్‌ను వ‌సూలు చేస్తారు. వార్షిక ఆదాయం రూ.10 ల‌క్ష‌లు దాటిన వారిపై ఈ సెస్ విధించ‌బ‌డుతుంది. దీంతో రూ.18వేల కోట్ల వ‌ర‌కు ఆదాయం వ‌స్తుంద‌ని అంచనా.

* కార్పొరేట‌ర్ సోష‌ల్ రెస్పాన్సిబిటీ (సీఎస్ఆర్‌), ఇంటి ట్యాక్స్ సేవింగ్స్ స్కీంల ద్వారా వచ్చే డ‌బ్బును కోవిడ్ 19 రిలీఫ్‌కు ఉప‌యోగించ‌నున్నారు. అలాగే 1985 వ‌ర‌కు అమ‌లులో ఉన్న ఇన్‌హెరిట‌న్స్ ట్యాక్స్‌ను మ‌ళ్లీ విధించే యోచ‌న‌లో ఉన్నారు.

* 2016 ప్ర‌వేశ‌పెట్టిన ఈక్వ‌లైజేష‌న్ లెవీ ట్యాక్స్ 6 శాతంగా ఉండ‌గా.. దీన్ని ఇంకా ఎక్కువ‌కు పెంచాల‌ని చూస్తున్నారు. త‌ద్వారా కేంద్రానికి ఆదాయం పెర‌గ‌నుంది.

* నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైం త‌దిత‌ర ఆన్‌లైన్ స్ట్రీమింగ్ స‌ర్వీసుల‌పై డిజిట‌ల్ ప‌న్ను విధించాల‌ని, తద్వారా మ‌రింత ఆదాయం వ‌స్తుంద‌ని కేంద్రం భావిస్తోంది.

* సంప‌న్నులు గ్యాస్ స‌బ్సిడీని వ‌దులుకునే విధంగా మ‌రింత విస్తృతంగా ప్ర‌చారం చేయ‌నున్నారు. దీంతో కేంద్రంపై ప‌డే భారం కొంత వ‌ర‌కు త‌గ్గుతుంది.

* దేశంలో సెక్ష‌న్ 80సి కింద ఇచ్చే మిన‌హాయింపుల‌ను సంప‌న్నులు వ‌దులుకోవాల‌ని కేంద్రం కోర‌నుంది. దీంతో కేంద్రానికి వ‌చ్చే ఆదాయం పెర‌గ‌నుంది.

అయితే పైన చెప్పిన‌వే కాకుండా.. రానున్న 6 నెల‌ల కాలంలో కేంద్రం త‌న ఆదాయాన్ని పెంచుకునేందుకు వీలున‌న్ని మార్గాల‌ను అనుస‌రించాల‌ని చూస్తున్న‌ట్లు తెలిసింది. దీనిపై త్వ‌ర‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఒక ప్ర‌క‌ట‌న వెలువరించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news