Bigg Boss Telugu 3 Episode 21: అలీతో గుంజిళ్లు తీయించిన నాగ్.. తమన్నా, రాహుల్ కు వార్నింగ్

-

టాస్క్ లో భాగంగా అలీ.. హిమజ జేబులో చేయి పెట్టి డబ్బులు లాక్కోవడం.. ఆమెపై అరవడంతో నాగ్ చాలా సీరియస్ అయ్యారు. ఇంకోసారి ఇలా చేస్తే బాగుండదని వార్నింగ్ ఇచ్చారు.

నిన్నటి ఎపిసోడ్ లో మాత్రం నాగ్ తన విశ్వరూపాన్ని చూపించారు. నిన్న శనివారం కదా.. నాగ్ ఎపిసోడ్, మరోవైపు ఇంట్లో నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పే రోజు. దీంతో ఓవైపు ఇంటి సభ్యుల్లోనే కాదు.. బయట ప్రేక్షకుల్లోనూ ఆసక్తి పెరిగింది. అయితే.. రావడం రావడమే నాగ్.. అలీతో 21 గుంజిళ్లు తీయించి.. సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు.

టాస్క్ లో భాగంగా అలీ.. హిమజ జేబులో చేయి పెట్టి డబ్బులు లాక్కోవడం.. ఆమెపై అరవడంతో నాగ్ చాలా సీరియస్ అయ్యారు. ఇంకోసారి ఇలా చేస్తే బాగుండదని వార్నింగ్ ఇచ్చారు.

తర్వాత తమన్నాపై కూడా నాగ్ సీరియస్ అయ్యారు. రవి వెనకాల పడి ఆయన్ను ఏడిపించడంపై తమన్నాకు లాస్ట్ వార్నింగ్ ఇచ్చారు నాగార్జున.

అలాగే… డంబెల్ తో నిధి ఉన్న బాక్స్ ను పగుల గొట్టిన శ్రీముఖి, రవికి కూడా జాగ్రత్తగా ఉండాలంటూ తెలిపారు. బిగ్ బాస్ ఇంట్లోని వస్తువులను పగులగొట్టే అధికారం ఎవ్వరికీ లేదని తేల్చి చెప్పారు నాగ్.

ఇక.. ఫాల్త్ మాటలు మాట్లాడుతున్న రాహుల్ కి కూడా నాగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇంటి సభ్యులపై ఫాల్త్ మాటలు మాట్లాడొద్దంటూ చెప్పారు.

తర్వాత ఎలిమినేషన్ లో ఉన్న తమన్నా, బాబా భాస్కర్, పునర్నవి, వితిక, రాహుల్.. ఈ ఐదుగురిలో ఎవరు ఇంటి నుంచి వెళ్లిపోతున్నారో… ఆదివారం రోజు చెబుతా అంటూ వెళ్లిపోయారు నాగ్. చూద్దాం.. ఇవాళ ఇంట్లో నుంచి ఎవరు వెళ్లిపోతారో?

Read more RELATED
Recommended to you

Latest news