Bigg Boss Telugu 3 Episode 19: రవి, శ్రీముఖికి వార్నింగ్ ఇచ్చిన బిగ్ బాస్… పునర్నవి, అలీకి సీక్రెట్ టాస్క్

-

కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో నిన్న హింస చోటు చేసుకున్నది. టాస్క్ లో భాగంగా దొంగలుగా ఉన్న శ్రీముఖి, రవి, అషు.. ఎలాగైనా నిధి ఉన్న బాక్స్ ను పగులగొట్టాలనుకుంటారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 అప్పుడే 19 ఎపిసోడ్లను పూర్తి చేసుకున్నది. అంటే ఇంట్లో 18 రోజులు ముగిసిపోయాయి. ఇప్పటి వరకు హేమ, జాఫర్ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఆదివారం తమన్నా, పునర్నవి, బాబా భాస్కర్, వితిక, రాహుల్ లో ఎవరో ఒకరు బయటికి వెళ్లిపోతారు.

ఇక… కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో నిన్న హింస చోటు చేసుకున్నది. టాస్క్ లో భాగంగా దొంగలుగా ఉన్న శ్రీముఖి, రవి, అషు.. ఎలాగైనా నిధి ఉన్న బాక్స్ ను పగులగొట్టాలనుకుంటారు. అయితే… ఆ నిధి బాక్స్ ను పగులగొట్టడానికి శ్రీముఖి డంబెల్ తో సిద్ధమవుతుంది. మహేశ్.. శ్రీముఖికి ఆ ఐడియా ఇవ్వడంతో శ్రీముఖి కూడా ఓసారి అందరితో కన్ఫమ్ చేసుకొని నిధి ఉన్న బాక్స్ ను పగులగొట్టడానికి ప్రయత్నిస్తుంది.

డంబెల్ తో గ్లాస్ ను పగులగొట్టగానే గ్లాస్ ముక్కలవడం… రవి చేతితోనే దాన్ని కొట్టడంతో రవి చేతికి గాయం అవుతుంది. దీంతో టాస్క్ లో హింస చోటు చేసుకునేలా చేసిన శ్రీముఖి, రవికి బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తాడు. శ్రీముఖిని వచ్చే వారం డైరెక్ట్ గా బిగ్ బాస్ నామినేట్ చేశాడు. రవిని కూడా మరోసారి ఇలా జరగకుండా జాగ్రత్త తీసుకోవాలని వార్నింగ్ ఇచ్చాడు.

కట్ చేస్తే.. పునర్నవి, అలీకి బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇస్తాడు. ఆ టాస్క్ గురించి ఇంటి సభ్యులకు చెప్పకూడదు. అందరూ పడుకున్నాక రాత్రి పడక గదిలో ఉన్న డోర్ తీసుకొని ఆ సీక్రెట్ రూమ్ లోకి వెళ్లాలని చెబుతాడు. అలీ రాత్రి 2 గంటల సమయంలో సీక్రెట్ రూంలోకి వెళ్లగా, పునర్నవి ఉదయం వేక్ అప్ కాల్ ముందే 7.30 కు వెళ్లింది.

వేక్ అప్ కాల్ రాగానే హౌస్ లో అలీ, పునర్నవి మిస్ అయినట్టు ఇంటి సభ్యులు తెలుసుకుంటారు. ఎక్కడ వెతికినా కనిపించకపోయే సరికి లైట్ తీసుకుంటారు. అయితే.. బిగ్ బాస్ ముందుగా పునర్నవి, అలీని అడుగుతాడు. ఇంట్లోని మిగితా సభ్యులు రెండు త్యాగాలు చేస్తే ఇద్దరినీ ఇంట్లోకి పంపిస్తానంటాడు బిగ్ బాస్.

అయితే.. ఇంట్లోని సభ్యులంతా వారం పాటు చెప్పులు లేకుండా తిరగడం, పెరుగు తినకూడదని చెబుతారు. అదే విషయాన్ని బిగ్ బాస్ ఇంటి సభ్యులకు తెలుపుతాడు. అంతే కాదు.. వాళ్లిద్దరు రాకూడదని అనుకుంటున్న సభ్యులు ఎవరో చెప్పాలనగా… వాళ్లు తిరిగి ఇంట్లోకి రాకున్నా పర్లేదని హిమజ, బాబా భాస్కర్ చెబుతారు. అయితే.. ఇంట్లోని సభ్యుల మాటలన్నింటినీ పునర్నవి, అలీ వినడం గమనార్హం. ఇంతటితో బిగ్ బాస్ 19వ ఎపిసోడ్ పూర్తవుతుంది. చూద్దాం.. ఇవాళ ఏం జరుగుతుందో?

Read more RELATED
Recommended to you

Latest news