ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు స్వీకరించారు చంద్రబాబు నాయుడు. సాయంత్రం 4 గంటలకు సీఎం చంద్రబాబు సచివాలయానికి బయలు దేరారు. భారీ హోర్డింగ్ లు, గజమాలలతో ఆయనకు దారి పొడవునా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నినాదాలతో హోరెత్తించారు. సీఎం మార్గ మధ్యలో తన కాన్వాయ్ ని ఆపి వారితో మాట్లాడారు. చంద్రబాబు  సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. 

బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలి సంతకం మెగా డీఎస్సీ పై చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పై రెండో సంతకం చేశారు. అలాగే పింఛన్లు రూ.4వేలు పెంచుతూ ఫైల్ పై మూడో సంతకం, అలాగే స్కిల్ సెన్సస్,  అన్న క్యాంటిన్ పున:ప్రారంభం పై కూడా సంతకం చేశారు చంద్రబాబు. పెన్షన్ల పెంపు ఫైల్ పై సంతకం చేసే సమయంలో వృద్ధులు, వికలాంగులు అక్కడికి చేరుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version