Budget 2024 : కేంద్రం కీలక నిర్ణయం.. స్మార్ట్ ఫోన్ కొనుగోలు దారులకు గుడ్ న్యూస్..!

-

పార్లమెంట్లో మభ్యంతర బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న తరుణంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం వసూలు చేస్తున్న ఇంపోర్ట్ డ్యూటీని తగ్గిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. భారత్లో ఆయా స్మార్ట్ఫోన్ కంపెనీలు స్థానికంగా ఫోన్ తయారు చేయాలంటే అందుకు అవసరమయ్యే విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది.

అలా దిగుమతి చేసుకున్నందుకు స్మార్ట్ ఫోన్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వానికి 15% ఇంపార్టు డ్యూటీని చెల్లించాలి. కాజా గా ఇంపోర్టు డ్యూటీని 15% నుంచి 10 శాతానికి తగ్గించింది. ఎల్సిడి ఛానల్ డిస్ప్లే అసెంబ్లీ విభాగాల పై దిగుమతి సుంకాలు 10 శాతానికి తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. దిగుమతి సుంకాలను తగ్గించడం ద్వారా యాపిల్ సాంసంగ్ కంపెనీలు ఎగుమతులు పెంచడంలో సహాయపడుతుందని దీని ద్వారా స్మార్ట్ ఫోన్ తయారీ మార్కెట్లో కీలక పాత్ర పోషిస్తున్న చైనా వియత్నాం వంటి దేశాలతో భారత్ పోటీపడేందుకు అవకాశం గా మారుతుందని మార్కెట్ ట్రిప్పునులు పేర్కొంటున్నారు. దిగుమతి సుంకం తగ్గింపుతో భారత్ లో స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news