తెలంగాణాలో టెస్ట్ లు పెరగడంతో పెరుగుతున్న కరోన కేసులు

-

తెలంగాణాలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. పక్క రాష్ట్రం ఏపీతో పోలిస్తే కేసుల నమోదు తక్కువే ఉన్నా తెలంగాణా వాసులను కరోనా భయం వీడ లేదు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 1,842 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 1,06,091కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 6 మంది కరోనా వలన చనిపోయారు దీంతో ఇప్పటిదాకా కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 761కు చేరింది. ఇక ఇప్పటిదాకా కరోనా నుండి 82,411 మంది కోలుకోగా నిన్న ఒక్కరోజే 1,825 మంది కరోనా బారి నుండి కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో 1,825 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. అందులో 16,482 మంది హాస్పిటల్స్ లో కాకుండా హోం ఐసోలేషన్ లోనే ఉన్నారు. ఇక నిన్న ఒక్కరోజే 36,282 శాంపిల్స్ టెస్ట్ చేయగా ఇప్పటిదాకా టెస్ట్ చేసిన శాంపిల్స్ సంఖ్య 9,68,121కి చేరింది. ఎప్పటిలానే జీహెచ్ఎంసీలో భారీగా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే ఇక్కడ 373 కేసులు నమోదు కాగా ఆ తరువాతి స్థానంలో నిజామాబాద్ జిల్లా 158 కేసులతో నిలిచింది. అలానే కరీంనగర్ జిల్లాలో కూడా 134 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news