తెలంగాణా కరోనా అప్డేట్ : 1,708 కేసులు, 5 మరణాలు

-

తెలంగాణాలో కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్న కరోనా కేసులు కొద్ది రోజులుగా మళ్ళీ పెరుగుతున్నాయి. అయితే నిన్నటి బులెటిన్ లో కరోనా కేసులు తక్కువగానే నమోదయ్యాయి. మొన్న ఆదివారం కావడంతో రోజూ చేసే టెస్ట్ లలో సగానికి సగం తగ్గిపోయాయి. దీంతో కరోనా కేసులు కూడా తక్కువగానే నమోదయ్యాయి. అయితే నిన్న సోమవారం మళ్ళీ టెస్ట్ లు పెంచడంతో తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న 1,708 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,14,792 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న కరోనాతో 5 గురు మరణించారు. ఇప్పటి వరకు 1233 మంది కరోనాతో మరణించారు.

ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 24,208గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు తెలంగాణాలో 1,89,351 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న ఒక్క రోజే 2,009 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణాలో రికవరీ రేటు 88.15% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 86.8% శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0.57 %గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 46,835 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 36,24,096 పరీక్షలు చేసారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా 277 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news