తెలంగాణాలో మళ్ళీ భారీగా పెరిగిన కరోనా కేసులు

-

తెలంగాణాలో కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్నా కరోనా కేసులు మళ్ళీ భారీగానే పెరుగుతున్నాయి. ఈ మధ్య ఏ రోజూ 2 వేలకు తక్కువగా కరోనా కేసులు నమోదు కావడం లేదు. అయితే నిన్న కరోనా కేసుల నమోదు భారీగా తగ్గింది. అయితే మళ్ళీ ఈ కేసులు ఈరోజు భారిగా పెరిగాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న 2,072 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,89,283 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న కరోనాతో 9 మంది మరణించారు. ఇప్పటి వరకు 1116 మంది కరోనాతో మరణించారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 29,477గా ఉన్నాయి.

ఇక ఇప్పటి వరకు తెలంగాణాలో 1,58,690 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న ఒక్క రోజే 2,259 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణాలో రికవరీ రేటు 83.83% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 82.88% శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0.58 %గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 54,308 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 29,40,642 పరీక్షలు చేసారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా అంటే 283 కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా పరీక్షలు సగానికి తగ్గించడంతోనే కేసులు తగ్గినట్టు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news