సహనం కోల్పోయిన కర్ణాటక మాజీ సీఎం.. మహిళ చున్నీ లాగి.. వీడియో

-

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య సహనం కోల్పోయారు. విచక్షణ కోల్పోయారు. ఒక్కసారిగా ఓ మహిళపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి… విచక్షణారహితంగా ప్రవర్తించి ఆమె చున్నీ లాగాడు. ఆమెను కోప్పడుతూ.. మైకు లాక్కొని బలవంతంగా కూర్చోబెట్టాడు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వరుణ నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధరామయ్య సహనం కోల్పోయారు. ఓ మహిళ తన సమస్యలు చెప్పుకోవడానికి ఆయన దగ్గరికి వచ్చింది. ఎమ్మెల్యే అక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదని ఆయన ముందు వాపోయింది. దీంతో ఒక్కసారిగా కోపోద్రికుడైన సిద్ధరామయ్య.. ఆమె చేతిలోని మైకును గుంజుకొని.. ఆమె చున్నీ లాగి బలవంతంగా కూర్చోబెట్టాడు.

అయితే.. ఆయన కూర్చున్న టేబుల్ మీద తాను చేయి వేసినందుకే ఆయనకు కోపం వచ్చిందని.. అందుకే తన నుంచి మైకు గుంజుకున్నాడని ఆ మహిళ వెల్లడించింది. అందరి ముందూ తిట్టాడని వాపోయింది. తన కొడుకు ప్రాతినిథ్యం వహిస్తున్న వరుణ నియోజకవర్గంలో సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయని.. సమస్యలు తీర్చాలని ఓ మహిళ అభ్యర్థిస్తే.. సీఎం స్థాయి వ్యక్తి ఇలాగేనా ప్రవర్తించేది అంటూ చాలామంది ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కూడా సిద్ధరామయ్యపై ఫైర్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version