సైరా డైరక్టర్ కు సీరియస్ వార్నింగ్..!

-

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా వస్తున్న సైరా నరసింహా రెడ్డి సినిమా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తుంది. మెగా పవర్ స్టార్ రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ఇప్పటికే 200 కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. సినిమాలో కీలక సన్నివేశాలు.. యుద్ధ ఘట్టాలు షూటింగ్ పూర్తి చేసుకోగా మరికొన్ని సీన్స్ పెండింగ్ ఉన్నాయట. అయితే డైరక్టర్ సూరి ఇంకాస్త బడ్జెట్ కేటాయించాలని నిర్మాత చరణ్ ను కోరాడట.

అయితే ఇప్పటి వరకు పెట్టింది చాలు ఉన్నదానితోనే పూర్తి చేయాలని చెప్పాడట. ప్రస్తుతం సైరా యూనిట్ లో ఈ డిస్కషన్స్ జరుగుతున్నాయట. సురేందర్ రెడ్డి, చరణ్ మధ్య చిన్న డిస్టబెన్స్ కూడా వచ్చిందని అంటున్నారు. అయితే ఈ ఎఫెక్ట్ సినిమా మీద పడుతుందని మెగా ఫ్యాన్స్ కు భయం పట్టుకుంది. ముందు సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా దసరాకి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మరి అనుకున్న టైంకు వస్తుందా రాదా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version