తనను కరిచిన పామునే కొరికి చంపేశాడు..!

-

70 ఏళ్ల పర్వత్ గాలా బారియా అనే వ్యక్తి ట్రక్కులో మొక్కజొన్న పంటను లోడ్ చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన పాము.. అతడిని కాటేసింది. దీంతో కోపోద్రికుడైన బారియా.. దాన్ని వెతికి పట్టుకొని మరీ కొరికి చంపేశాడు.

మనిషి కుక్కను కరిస్తే వార్త కాదు.. కుక్కను మనిషి కరిస్తే వార్త.. అనే నానుడి విన్నారా ఎప్పుడైనా? ఆ నానుడి ఇప్పుడు నిజమైంది. కాకపోతే.. కుక్క ప్లేస్‌లో పాము వచ్చి చేరింది. గుజరాత్‌లోని మాహిసాగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని పాము కరిచింది. హమ్మా.. నన్నే కాటేస్తావా? ఆయ్.. అంటూ దాన్ని వెంటాడి వెంటాడి పట్టుకొని దాన్ని కసి తీర కొరికి చంపేశాడు. చదువుతుంటేనే ఒళ్లు జలదరిస్తోంది కదా. దాన్ని పరపరా కొరకడంతో పాము విషం ఆ వ్యక్తి శరీరంలోకి పాకింది. దీంతో ఆ వ్యక్తి కూడా చనిపోయాడు. దాన్ని పళ్లతో కొరికేయడంతో ఆ పాము కూడా చనిపోయింది.

70 ఏళ్ల పర్వత్ గాలా బారియా అనే వ్యక్తి ట్రక్కులో మొక్కజొన్న పంటను లోడ్ చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన పాము.. అతడిని కాటేసింది. దీంతో కోపోద్రికుడైన బారియా.. దాన్ని వెతికి పట్టుకొని మరీ కొరికి చంపేశాడు. అనంతరం.. ఆయన శరీరంలోకి విషం పాకడంతో.. అతడిని వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే విషం అతడి శరీరమంతా వ్యాపించడంతో అతడు మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version