మళ్లీ తడబడిన నారా లోకేశ్.. ‘వివేకా మృతి విషయం తెలిసి పరవశించాం’

-

అంటే నారా లోకేశుడిని అంటారు కానీ.. ఆయన తప్పేమన్నా ఉందా? ఆయనకు తెలుగు రాదని అందరికీ తెలిసిందే. మరి.. తెలుగులో మాట్లాడమంటే ఎలా? ఎంత నేర్చుకున్నా.. ఏదో ఒక తప్పు దొర్లడం కామన్ కదా తమ్ముళ్లు…

ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ అప్పుడప్పుడు చేసే చిన్న చిన్న తప్పులతో సోషల్ మీడియాలో బుక్కవుతుంటారు. ఇదివరకు చాలా సార్లు ఆయన మాట్లాడేటప్పుడు చేసిన తప్పులతో సోషల్ మీడియాలో అడ్డంగా బుక్కవుతారు. ఇప్పుడు మరోసారి బుక్కయ్యారు.

ఏపీలో త్వరలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి కదా. ఈసందర్భంగా ఆయన ప్రచారం చేస్తూ… వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయిన విషయాన్ని గుర్తు చేశారు.పాపం.. వివేకానంద రెడ్డి గారు చనిపోయారు.. పరవశించాం.. ఎవరు చేశారో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు చేస్తున్నారు. హత్య రాజకీయాలు చంద్రబాబు నాయకుడుకు తెలుసా తల్లి.. అంటూ ఆయన ప్రసంగించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు మళ్లీ నారా లోకేశ్ ను ఒక ఆట ఆడుకుంటున్నారు.



(Video Credit: Samayam Telugu)

Read more RELATED
Recommended to you

Exit mobile version