Aaradhya Bachchan : ఐశ్వర్యారాయ్ కూతురు ఫొటోలు వైరల్.. తల్లినే మించిన అందమంటూ నెటిజన్ల కామెంట్స్

-

భారతీయ చలన చిత్ర రంగంలో ఎంత మంది కథానాయికలు వచ్చిపోయినా విశ్వ సుందరి ఐశ్వర్యాయ్​ది మాత్రం ప్రత్యేక స్థానం. మిస్ యూనివర్స్ టైటిల్​ గెలిచిన ఈ బ్యూటీ.. ప్రపంచ వ్యాప్తంగా అందరి మనసులు దోచేసింది. మణిరత్నం తెరకెక్కించిన ఇరువుర్​(ఇద్దరు) సినిమాతో ఈ భామ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత బాలీవుడ్​కు వెళ్లి అక్కడే స్థిరపడింది.

చూపు తిప్పుకోనివ్వని అందం.. అద్భుతమైన నటన.. అంతకుమించిన మనసుతో ఐశ్వర్య అందరి మనసులు దోచేసింది. తన ప్రియుడు అభిషేక బచ్చన్​ను పెళ్లాడి ఆరాధ్యకు జన్మనిచ్చింది. అచ్చం తల్లిలాగే ఆరాధ్య కూడా అందగత్తే. తల్లిని మించిన అందంతో ఈ చిన్నారి కూడా అందరిని ఫిదా చేస్తోంది. తరచూ ఈ తల్లీకూతుళ్లు బాలీవుడ్ మీడియా కంట పడుతూ ఫొటోలకు పోజులిస్తుంటారు.

ఆరాధ్య-ఐశ్వర్యల ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆరాధ్యను చూసిన నెటిజన్లు అచ్చం తల్లిలాగే ఉందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఆరాధ్యను ఐష్​తో పోల్చలేమని.. ఐష్​ బ్యూటీని ఎవరితో పోల్చలేమని పొగిడేస్తున్నారు.

ఇంకొందరు నెటిజన్లు ఆరాధ్య.. ఐశ్వర్యకు ప్రింట్​ తీసినట్టుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరు తల్లీకూతుళ్లలా కాకుండా అక్కాచెల్లెళ్లుగా కనిపిస్తున్నారని అంటున్నారు. శుక్రవారం ముంబయిలో జరిగిన ఎన్​ఎంఏసీసీ ఈవెంట్ లాంచ్​కు ఐశ్వర్య తన కుమార్తె ఆరాధ్యతో కలిసి హాజరైంది. ఈ సందర్భంగా దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news