మధ్యాహ్నం నిద్ర ఎందుకు వస్తుంది..? ఈ తప్పు వల్లే తెలుసా?

-

పూర్తి ఆరోగ్యం బాగుండాలంటే ఆరోగ్యకరమైన ఆహారంతో పాటుగా నిద్ర కూడా ఎంతో అవసరం. సరైన నిద్ర లేకపోవడం వలన ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. అదే విధంగా ఎక్కువ సమయం నిద్రపోవడం వలన అనారోగ్యం తో బాధపడాల్సి వస్తుంది. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో చాలా మంది నిద్రపోతూ ఉంటారు. భోజనం చేసిన వెంటనే సహజంగా నిద్ర వస్తుంది. కాకపోతే ఆహారాన్ని తీసుకున్న వెంటనే నిద్రపోకూడదు అని మెలకువగా ఉంటారు. ఎంత ప్రయత్నించినా సరే నిద్ర రావడం సహజమే. అయితే దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.

ఎప్పుడైతే కడుపునిండా ఆహారాన్ని తీసుకుంటారో జీర్ణవ్యవస్థకు శక్తి ఎంతో అవసరం అవుతుంది. అదే విధంగా రక్త సరఫర కూడా ఎంతో అవసరం. ఈ విధంగా నిద్ర రావడం మరియు నీరసంగా అనిపించడం వంటి లక్షణాలు కనబడతాయి. ముఖ్యంగా ఎప్పుడైతే అల్పాహారాన్ని తీసుకోవడం మానేసి భోజనాన్ని మాత్రమే తీసుకుంటారో ఎక్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకుంటారు. ఈ విధంగా మధ్యాహ్నం సమయంలో ఎక్కువ నిద్రను కూడా పొందుతారు. అల్పాహారంలో భాగంగా ఓట్స్, బ్రౌన్ బ్రెడ్, గుడ్లు, పండ్లు వంటి మొదలైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వలన ఎంతో ఉత్సాహంగా ఉంటారు మరియు రోజంతా నీరసం లేక నిద్ర రాకుండా ఉంటారు.

చాలామంది మధ్యాహ్నం సమయంలో మాత్రమే కాకుండా రోజంతా ఎంతో నీరసంగా ఉంటారు. అలాంటి సమయంలో ఎక్కువ మంచి నీరుని తీసుకోవడం వలన రోజంతా ఎంతో చురుకుగా పనిచేస్తారు. అదేవిధంగా నిద్ర కూడా రాకుండా ఉంటుంది. ఈ విధంగా అల్పాహారాన్ని తీసుకోవడం మరియు మంచి నీరుని తాగడం వలన పూర్తి ఆరోగ్యం కూడా ఎంతో మెరుగ్గా ఉంటుంది. పైగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను చెక్ పెట్టవచ్చు. కనుక ఈ తప్పులను చేయకుండా మీ జీవన విధానంలో మార్పులు చేసుకుంటే మధ్యాహ్నం సమయంలో నిద్ర రాకుండా ఉంటుంది మరియు రోజంతా ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా జీవించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news