సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోతున్నారా? జనజీవనంలోకి రావాలంటే ఇలా చేయండి..!

-

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా కు చాలా మంది అడిక్ట్ అవుతున్నారు. ఎప్పుడైతే సోషల్ మీడియాకు దూరంగా ఉండి వాటి వినియోగాన్ని నియంత్రించుకుంటారో ఎంతో ప్రశాంతంగా జీవించవచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియా అడిక్షన్ ను తగ్గించుకోవడానికి డిజిటల్ డిటాక్స్ చేయడం ఎంతో అవసరం. ఒక ఎనిమిది రోజులు పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండడం వలన ఎంతో విశ్రాంతిని పొందుతారు. ఈ మధ్యకాలంలో నోటిఫికేషన్లు, బ్రేకింగ్ న్యూస్‌లు, రిప్లైలు లాంటివి చాలా ఎక్కువ అవుతున్నాయి. దీనివలన నిరంతరం మెదడును ఉత్తేజపరిచే విధంగా ఉంటున్నారు. పైగా తెలియకుండానే ఒక అలవాటుగా మారిపోయింది.

ముఖ్యంగా రీల్స్ వంటి వాటిని చూస్తున్నప్పుడు, ఫోన్ స్క్రోల్ చేసేటప్పుడు మెదడులో డోపమైన్ అనే కెమికల్ యాక్టివేట్ అవుతుంది. ఇదే విధంగా కొన్ని రోజులు కొనసాగించడం వలన మెదడుకు ప్రశాంతత దూరం అవుతుంది మరియు నిరంతరం ఉత్సాహాన్ని కోరుకునే విధంగా మారుతుంది. కనుక టెక్నాలజీ ను కేవలం కొంతవరకు మాత్రమే ఉపయోగించాలి. జీవితాలను నియంత్రించుకోకుండా టెక్నాలజీను ఉపయోగించడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. కనుక డిజిటల్ డిటాక్స్ చేయడం ఎంతో అవసరం. ఎనిమిది రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండడం వలన మంచి నిద్రను పొందుతారు మరియు దృష్టి మెరుగ్గా ఉంటుంది. దీంతో సరైన నిర్ణయాలను తీసుకుంటారు.

అంతేకాకుండా ఇతరులతో మాట్లాడడానికి ఇష్టపడతారు. సంభాషణలు, సమావేశాలలో ఏకాగ్రత చూపిస్తారు. ఈ విధంగా మొబైల్ ఫోన్‌కు దూరంగా ఉండడం వలన మీ హాబీలపై సమయాన్ని గడుపుతారు. వీటితో పాటుగా పుస్తకాలు, ప్రకృతి, ఇతర వ్యక్తులతో అనుబంధం ఏర్పడుతుంది. కనుక మెరుగైన జీవనం కోసం మీ సోషల్ మీడియా అకౌంట్లకు దూరంగా ఉండాలి. కాబట్టి ఎనిమిది రోజులపాటు ఇలా చేయడం వలన ఎంతో ప్రశాంతంగా ఉంటారు. పైగా ఎటువంటి సమయం కూడా వృథా అవ్వకుండా ఉంటుంది. కనుక టెక్నాలజీ నుండి పారిపోవడం కాకుండా, సమయాన్ని సరైన విధంగా వినియోగించుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news