నిద్ర లేచాక, నిద్రపోయేటప్పుడు.. ఇలా ఈ దేవుళ్ళని స్మరించుకుంటే మంచిది..!

-

ప్రతిరోజు మనం నిద్రపోతూ ఉంటాము నిద్రలేస్తూ ఉంటాము. నిద్రపోయే ముందు నిద్రలేచిన వెంటనే ఇలా చేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది అనుకున్నవి జరుగుతాయి చక్కటి శాంతి ఉంటుంది. నిద్రలేచిన తర్వాత కచ్చితంగా దేవుడుని స్మరించాలి. అలా చేయడం వలన శాంతి కలుగుతుంది. శారీరిక మానసిక ఒత్తిడి మొత్తం కూడా పోతుంది. నిద్ర ఆరోగ్యానికి చాలా అవసరం. మంచి నిద్ర ఉంటే మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది అయితే దైవాన్ని నమ్మే ప్రతి ఒక్కరు కూడా నిద్ర లేచే ముందు కచ్చితంగా ఒకసారి దేవుని స్మరించుకోవాలి.

నిద్రపోయేటప్పుడు కూడా దేవుడిని స్మరించుకోవాలి దీనివలన చక్కగా ఒత్తిడి తొలగిపోతుంది శాంతి కలుగుతుంది, పైగా దేవుడిని ఒకసారి తలచుకోవడం వలన పుణ్యం కూడా వస్తుంది. అనుకున్నవి జరుగుతాయి. నిద్రపోయే ముందు ఒకసారి ఓం నమశ్శివాయ అని చెప్తూ నిద్రలోకి వెళ్లారంటే పీడకలలు ఏమీ కూడా రావు ప్రశాంతంగా నిద్రపోవచ్చు.

మంచి నిద్ర వస్తుంది, నిద్రలేచిన తర్వాత విష్ణు నామాన్ని స్మరించుకోవాలి విష్ణు నామాన్ని నిద్రలేచిన తర్వాత స్మరించుకుంటే రోజంతా కూడా మంచే జరుగుతుంది ఎలాంటి సమస్యలు కూడా కలగవు కాబట్టి నిద్రలేచిన వెంటనే విష్ణుమూర్తి ని తలచుకుని రెండు చేతుల్ని రాపిడి చేసి చేతుల్ని చూసుకుంటూ నిద్ర లేవాలి. మన అరచేతుల్లో లక్ష్మీ సరస్వతి గౌరీ దేవులు ఉంటారట కాబట్టి మంచి జరుగుతుంది ప్రశాంతంగా ఉండొచ్చు హాయిగా జీవించొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news