వేసవి లో ఈ గింజలను తిన్నారంటే.. మీ ఆరోగ్యానికి ఢోకా ఉండదు..!

-

వేసవికాలంలో సహజంగా ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడరు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వలన కేవలం మంచినీరు లేక ఇతర పానీయాలను తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ గింజలను తీసుకోవడం వలన ఎన్నో ఉపయోగాలను పొందవచ్చు. గింజలను తీసుకోవడం వలన విటమిన్లు, మినరల్స్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు శరీరానికి అందుతాయి. దీంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ముఖ్యంగా రోగనిరోధక వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. మీ ఆహారంలో భాగంగా అవిస గింజలను తీసుకోవడం వలన శరీరానికి తగినంత ఫైబర్ అందుతుంది.

అదేవిధంగా కొలెస్ట్రాల్ ను కరిగించడానికి కూడా సహాయం చేస్తుంది. డయాబెటిస్ వంటి సమస్యతో బాధపడేవారు తప్పకుండా అవిస గింజలను తీసుకోవాలి. వీటిని తినడం వలన ఆరోగ్యంగా జీవించవచ్చు. ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతుంటే నువ్వులను కచ్చితంగా మీ డైట్ లో చేర్చుకోండి. నువ్వులను తీసుకోవడం వలన శరీరానికి తగినంత కాల్షియం, ఐరన్ అందుతుంది. అదేవిధంగా జీర్ణ సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. గుమ్మడి గింజలను తీసుకోవడం వలన శరీరానికి తగినంత మెగ్నీషియం, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి.

అదే విధంగా రోగనిరోధక వ్యవస్థ మెరుగు పడటానికి సహాయం చేస్తుంది మరియు కండరాలను బలంగా చేస్తాయి. జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా మీ రోజువారి ఆహారంలో వీటిని తప్పక తీసుకోండి. గుమ్మడి గింజలలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి. అదేవిధంగా జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. సహజంగా గసగసాలను ఎక్కువగా ఉపయోగించరు. కాకపోతే వీటిలో ఫైబర్, క్యాల్షియం, మెగ్నీషియం మరియు జింక్ పుష్కలంగా ఉంటాయి. వీటి వలన ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు. పైగా గుండెకు సంబంధించిన సమస్యలను మరియు డయాబెటిస్ ను కూడా తగ్గించుకోవచ్చు. కనుక ఇటువంటి ఆహార పదార్థాలను వేసవికాలంలో తీసుకోవడం వలన ఎన్నో లాభాలను పొంది ఆరోగ్యంగా ఉండవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news