తన మైనపు బొమ్మను చూసి నోరెళ్లబెట్టిన అనుష్క శర్మ!

-

అనుష్క శర్మ.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. అంతేనా కాదు కాదు.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ముద్దుల భార్య. అందుకే ఆమెకు సింగ‌పూర్‌లోని ప్రముఖ మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో స్థానం దక్కింది. ఆ మ్యూజియంలో ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీల మైనపు బొమ్మలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అనుష్క శర్మ విగ్రహాన్ని కూడా ఆ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. తన మ్యూజియం ఏర్పాటు అనంతరం అక్కడికి వెళ్లిన అనుష్క.. ఆ విగ్రహాన్ని చూసి షాకయిందట. నోరెళ్లబెట్టిందట. వావ్.. అచ్చం తనలాగే ఉందంటూ ఆశ్చర్యపోయిందట. అనుష్క మైనపు బొమ్మ చేతిలో ఓ సెల్ ఫోన్ కూడా ఉంది. ఆ ఫోన్‌ను క్లిక్‌మనిపించి సెల్ఫీ కూడా తీసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version