చాయ్ వాలి చాచి.. 30 ఏళ్ల నుంచి చాయ్ మాత్రమే ఆమె ఫుడ్..!

-

అవును.. మీరు షాక్ అవ్వొచ్చు. ఎందుకంటే ఇది నిజంగానే షాక్ అయ్యే విషయం. ఓ వ్యక్తి 30 ఏళ్ల నుంచి కేవలం చాయ్ తాగి బతుకుతున్నారంటే అది నిజంగా మిరాకిలే కదా. ఛత్తీస్ గఢ్ కు చెందిన ఓ మహిళ 30 ఏళ్ల నుంచి ఇలా చాయ్ ని మాత్రమే తాగుతూ బతుకుతోంది. ఎందుకలా.. అంటారా? అయితే.. మనం ఓసారి ఛత్తీస్ గఢ్ వెళ్లాల్సిందే.

ఛత్తీస్ గఢ్ లోని బరాడియా ఆమె గ్రామం. తనకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ఆ మహిళ(పిల్లయి దేవి) చాయ్ తాగడం ప్రారంభించిందట. తర్వాత పూర్తిగా మిగితా ఫుడ్ తీసుకోవడం మానేసి కేవలం బ్లాక్ టీని మాత్రమే తీసుకోవడం స్టార్ట్ చేసిందట. కుటుంబ సభ్యులు తనకు తినిపించేందుకు ఫోర్స్ చేసినా తను అస్సలు తినకపోయేదట. దీంతో ఎంతో మంది డాక్టర్ల దగ్గరకు తీసుకుపోయినా తనకున్న ఆ జబ్బును మాత్రం మాయం చేయలేకపోయారు. జబ్బంటే ఒంట్లో ఏదైనా సమస్య ఉందనుకునేరు. చాయ్ తాగడమే తన జబ్బు కదా. చాయ్ తాగి.. వేరే ఎటువంటి ఆహారం ముట్టుకోకున్నా తను మాత్రం ఆరోగ్యంగానే ఉండేదట. దీంతో తన కుటుంబ సభ్యులు కూడా తన ఇష్టానుసారంగా ఉండనిచ్చారట. తనను వదిలేశారట. అప్పటి నుంచి అలాగే చాయ్ మాత్రమే తాగుతూ తన జీవితాన్ని గడుపుతోంది పిల్లయి దేవి. ఇప్పుడు తన వయసు 44 ఏళ్లు. ఆమె టీ మాత్రమే తాగుతుంది కాబట్టి.. తనను అక్కడ అంతా చాయ్ వాలి చాచి అని ముద్దుగా పిలుస్తారట. అదండి చాయ్ వాలి స్టోరీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version