తొలి రైల్వే టిక్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌గా హిజ్రా

-

రాష్ట్రంలో తొలిసారిగా రైల్వే టిక్కెట్‌ ఇన్‌స్పెక్టరుగా నాగర్‌ కోవిల్‌కు చెందిన హిజ్రా సింధు నియమితులయ్యారు. ఈమె తమిళ సాహిత్యంలో బి. లిటరేచర్‌ చదివారు. 19 ఏళ్ల క్రితం రైల్వే శాఖలో ఉద్యోగంలో చేరారు. మొదట కేరళ రాష్ట్రం ఎర్నాకుళంలో పని చేశారు. అనంతరం బదిలీపై దిండుక్కల్‌కు వచ్చారు.

ఓ ప్రమాదంలో ఆమె చెయ్యికి తీవ్రగాయం కావడంతో సింధును అధికారులు వాణిజ్య విభాగానికి బదిలీ చేశారు. అక్కడ విధులు నిర్వర్తిస్తూ ఆమె టిక్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌గా శిక్షణ పూర్తి చేయడంతో సింధు దిండుక్కల్‌ రైల్వే డివిజన్‌లో టిక్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌గా నియమితులయ్యారు.  గురువారం రోజున బాధ్యతలు స్వీకరించారు. ఈమెకు రైల్వే స్టేషన్‌ మేనేజర్‌ గోవిందరాజ్‌, సెక్రటరీ రబీక్‌ తదితరులు అభినందనలు తెలిపారు.

“ఇది నా జీవితంలో మరచిపోలేని జ్ఞాపకం. హిజ్రా కావడంతో ఏమీ చేయలేమన్న నిరుత్సాహం నుంచి ఈ స్థాయికి చేరుకున్నందుకు గర్వంగా ఉంది. హిజ్రాలు తమకున్న సమస్యలతో కుంగిపోకుండా విద్య, శ్రమతో ఉన్నత స్థాయికి చేరుకోవాలి” అని సింధు ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news