సోషల్ మీడియా కాలంలో ప్రతి ఒక్కరూ ఏ వస్తువు కొనాలన్నా ఆన్లైన్ లోనే కొనుగోలు చేస్తున్నారు. ఎంత చిన్న వస్తువైనా పెద్ద వస్తువు అయినా సరే షాప్ కి వెళ్లి కొనుగోలు చేయడం పూర్తిగా మానేశారు. అన్నింటిని ఆన్లైన్ లోనే కొనుగోలు చేస్తున్నారు. బయట మార్కెట్లో కన్నా ఆన్లైన్లో రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ లెక్క చేయకుండా కొనుగోలు చేస్తున్నారు. ఇందులో కొన్నిసార్లు మంచి జరిగితే మరికొన్ని సార్లు మోసం కూడా జరుగుతుంది.

ఈ క్రమంలోనే ఫ్లిప్ కార్ట్ లో ఓ యువకుడు యాపిల్ మ్యాక్ బుక్ ప్రోను ఆర్డర్ చేసి రెండు సార్లు మోసపోయారు. వివరాల్లోకి వెళ్తే ఫ్లిప్ కార్ట్ లో రూ. 2.6 లక్షల విలువ చేసే యాపిల్ మ్యాక్స్ బుక్ ప్రోను ఆర్డర్ చేసి పూర్తిగా మోసపోయారు. కొరియర్ లో కొత్త లాప్టాప్ కు బదులుగా పాత ల్యాప్టాప్ ను ఫ్లిప్ కార్ట్ సంస్థ పంపించింది. అనంతరం డెలివరీ బాయ్ ఓపెన్ చేయడంతో వెంటనే కస్టమర్ రిటర్న్ పంపించాడు. అనంతరం మళ్లీ కొనుగోలు చేయడంతో రెండోసారి కూడా పాత ల్యాప్టాప్ రావడంతో ఆ కస్టమర్ విసిగిపోయాడు. దీంతో ఈ వార్తను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఫ్లిప్కార్ట్ సంస్థ ఇలా చేయడం సరికాదని చాలామంది నెటిజన్లు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఫ్లిప్కార్ట్లో రూ. 2.6 లక్షల విలువ చేసే యాపిల్ మ్యాక్బుక్ ప్రోను ఆర్డర్ చేసి రెండు సార్లు మోసపోయిన యువకుడు
కొరియర్లో కొత్త ల్యాప్టాప్ బదులు పాత ల్యాప్టాప్ పంపిన ఫ్లిప్కార్ట్
డెలివరీ బాయ్ ఓపెన్ చేయడంతో వెంటనే రిటర్న్ ఇచ్చిన కస్టమర్
రెండోసారి కూడా పాత ల్యాప్టాప్ రావడంతో… pic.twitter.com/QX9qrFFMDV
— Telugu Scribe (@TeluguScribe) June 10, 2025