ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో ఆర్సిబి జట్టు విజయాన్ని సాధించింది. 18 సంవత్సరాల తర్వాత ఆర్సిబి జట్టు ట్రోఫీని సొంతం చేసుకొని చేతులలో పట్టుకొని ముద్దాడారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించడంతో ప్రతి ఒక్క ఆర్సిబి అభిమాని ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషాన్ని ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే ఆర్సిబి యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్సిబి ఫ్రాంచైజీని కొంతమేరకు లేదా పూర్తిగా అమ్మడానికి నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

ప్రస్తుతం ఆర్సీబీ విలువ రెండు బిలియన్ డాలర్లు అంటే సుమారు 16 వేల కోట్లు ఉంటుందని బ్లూమ్ బెర్గ్ అంచనా వేసింది. ఈ ఫ్రాంచైజీ బ్రిటిష్ డిస్టిలర్, యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ ల మాతృసంస్థ అయినటువంటి డియా జియో పిఎల్సీ వద్ద కొనసాగుతోంది. ఆర్సిబిని అమ్మేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుందని తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు. ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.